Ap News: డ్రగ్స్‌ వ్యవహారం.. విజయవాడ అడ్రస్‌ ఉందని సీఎంను నిందిస్తారా?: సుచరిత

డ్రగ్స్‌ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు సరైనవి కాదని రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. డ్రగ్స్‌ దిగుమతి అడ్రస్‌ విజయవాడ పేరిట ఉందని సీఎంను నిందించడం దారుణమన్నారు....

Published : 08 Oct 2021 01:23 IST

గుంటూరు: డ్రగ్స్‌ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు సరైనవి కాదని రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. డ్రగ్స్‌ దిగుమతి అడ్రస్‌ విజయవాడ పేరిట ఉందని సీఎంను నిందించడం దారుణమన్నారు. గుంటూరు జీజీహెచ్‌లో ఏర్పాటు చేసిన రెండు ఆక్సిజన్‌ ప్లాంట్లను మంత్రి ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. గంజాయి, ఇతర మాదకద్రవ్యాల విక్రయం, వాడకంపై ఉక్కుపాదం మోపుతున్నామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేలా ప్రతిపక్ష నేతలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాలిబన్లతో రాష్ట్రానికి సంబంధం అంటగడుతూ ప్రతిపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలు అర్థరహితమని కొట్టిపారేశారు. గుజరాత్‌లో డ్రగ్స్ దొరికాయని ప్రధాని మోదీకి లింకు పెడతారా?అని ప్రశ్నించారు. దేశంలో డ్రగ్స్ రాకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. దేశంలోకి పెద్ద ఎత్తున మాదవద్రవ్యాలు రావడం అందరి వైఫల్యంగా భావించాలని అభిప్రాయపడ్డారు. మాదకద్రవ్యాల నిరోధక, నియంత్రణ బాధ్యత ప్రజలందరిపైనా ఉందని సుచరిత పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని