Ap News: డ్రగ్స్ వ్యవహారం.. విజయవాడ అడ్రస్ ఉందని సీఎంను నిందిస్తారా?: సుచరిత
డ్రగ్స్ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు సరైనవి కాదని రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. డ్రగ్స్ దిగుమతి అడ్రస్ విజయవాడ పేరిట ఉందని సీఎంను నిందించడం దారుణమన్నారు....
గుంటూరు: డ్రగ్స్ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు సరైనవి కాదని రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. డ్రగ్స్ దిగుమతి అడ్రస్ విజయవాడ పేరిట ఉందని సీఎంను నిందించడం దారుణమన్నారు. గుంటూరు జీజీహెచ్లో ఏర్పాటు చేసిన రెండు ఆక్సిజన్ ప్లాంట్లను మంత్రి ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. గంజాయి, ఇతర మాదకద్రవ్యాల విక్రయం, వాడకంపై ఉక్కుపాదం మోపుతున్నామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేలా ప్రతిపక్ష నేతలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాలిబన్లతో రాష్ట్రానికి సంబంధం అంటగడుతూ ప్రతిపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలు అర్థరహితమని కొట్టిపారేశారు. గుజరాత్లో డ్రగ్స్ దొరికాయని ప్రధాని మోదీకి లింకు పెడతారా?అని ప్రశ్నించారు. దేశంలో డ్రగ్స్ రాకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. దేశంలోకి పెద్ద ఎత్తున మాదవద్రవ్యాలు రావడం అందరి వైఫల్యంగా భావించాలని అభిప్రాయపడ్డారు. మాదకద్రవ్యాల నిరోధక, నియంత్రణ బాధ్యత ప్రజలందరిపైనా ఉందని సుచరిత పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని