ఈటల రాజేందర్‌ పాదయాత్ర ప్రారంభం

మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్‌ ‘ప్రజాదీవెన పాదయాత్ర’ హుజూరాబాద్‌

Updated : 19 Jul 2021 10:45 IST

కమలాపూర్‌: మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్‌ ‘ప్రజాదీవెన పాదయాత్ర’ హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ప్రారంభమైంది. కమలాపూర్‌ మండలం బత్తినవారిపల్లె నుంచి ఆయన పాదయాత్రగా బయలుదేరారు. అంతకముందు ఈటల సతీమణి జమున, మాజీ జడ్పీ ఛైర్మన్‌ తుల ఉమ వీరతిలకం దిద్ది మంగళహారతులు ఇచ్చారు. కార్యక్రమంలో భాజపా నేతలు వివేక్‌, ఏనుగు రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మొదటి రోజు నియోజకవర్గంలోని మాదన్నపేట, గునిపర్తి, శ్రీరాములపేట, అంబల గ్రామాల మీదుగా ఈటల పాదయాత్ర చేస్తారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో 23 రోజుల పాటు ఆయన పాదయాత్ర చేయనున్న విషయం తెలిసిందే. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని