TS News: రేవంత్పై జగ్గారెడ్డి ఫిర్యాదు..సోనియాకు 4పేజీలలేఖ!
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై ఆ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి సోనియా గాంధీకి ఫిర్యాదు చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలతో పాటు ఇటీవల చోటుచేసుకున్న పలు...
హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై ఆ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి సోనియా గాంధీకి ఫిర్యాదు చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలతో పాటు ఇటీవల చోటుచేసుకున్న పలు అంశాలను పొందుపరుస్తూ నాలుగు పేజీల లేఖ రాశారు. కాంగ్రెస్ పంథాలో ముందుకు వెళ్లడంలేదని జగ్గారెడ్డి ఆరోపించారు. వైఖరి మార్చుకోకపోతే రేవంత్ని పీసీసీ అధ్యక్ష పదవి నుంచి మార్చి.. కాంగ్రెస్ పంథాలో పనిచేసే కొత్త పీసీసీ చీఫ్ని నియమించాలని కోరారు.
రేవంత్ వ్యవహారశైలితో కాంగ్రెస్ నేతలు ఇబ్బందులు పడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. నేతలతో చర్చించకుండానే ఆయన పార్టీ కార్యక్రమాలు చేపడుతున్నారని విమర్శించారు. ఓ సీనియర్ నాయకుడిగా తానూ అవమానాలు ఎదుర్కొంటున్నానన్నారు. తన జిల్లాలో తనకు తెలియకుండా కార్యక్రమం ప్రకటించడం తప్పు అని.. చాలా బాధతో, వేదనతో ఈ లేఖ రాస్తున్నా అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీని కాపాడుకోడానికి మాత్రమే కొన్ని వాస్తవాలు మీ దృష్టికి తెస్తున్నానని, రేవంత్తో తనకు ఏలాంటి విబేధాలు లేవని తెలిపారు. కేవలం పార్టీ ప్రయోజనాల దృష్ట్యా తాను ఈ లేఖ రాసినట్టు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!