TS News: రేవంత్‌పై జగ్గారెడ్డి ఫిర్యాదు..సోనియాకు 4పేజీలలేఖ!

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డిపై  ఆ పార్టీ సీనియర్‌ నేత జగ్గారెడ్డి సోనియా గాంధీకి ఫిర్యాదు చేశారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికలతో పాటు ఇటీవల చోటుచేసుకున్న పలు...

Updated : 28 Dec 2021 13:21 IST

హైదరాబాద్‌: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డిపై  ఆ పార్టీ సీనియర్‌ నేత జగ్గారెడ్డి సోనియా గాంధీకి ఫిర్యాదు చేశారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికలతో పాటు ఇటీవల చోటుచేసుకున్న పలు అంశాలను పొందుపరుస్తూ నాలుగు పేజీల లేఖ రాశారు. కాంగ్రెస్‌ పంథాలో ముందుకు వెళ్లడంలేదని జగ్గారెడ్డి ఆరోపించారు. వైఖరి మార్చుకోకపోతే రేవంత్‌ని పీసీసీ అధ్యక్ష పదవి నుంచి మార్చి.. కాంగ్రెస్‌ పంథాలో పనిచేసే కొత్త పీసీసీ చీఫ్‌ని నియమించాలని కోరారు. 

రేవంత్ వ్యవహారశైలితో కాంగ్రెస్‌ నేతలు ఇబ్బందులు పడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. నేతలతో చర్చించకుండానే ఆయన పార్టీ కార్యక్రమాలు చేపడుతున్నారని విమర్శించారు. ఓ సీనియర్‌ నాయకుడిగా తానూ అవమానాలు ఎదుర్కొంటున్నానన్నారు. తన జిల్లాలో తనకు తెలియకుండా కార్యక్రమం ప్రకటించడం తప్పు అని.. చాలా బాధతో, వేదనతో ఈ లేఖ రాస్తున్నా అని పేర్కొన్నారు.  కాంగ్రెస్‌ పార్టీని కాపాడుకోడానికి మాత్రమే కొన్ని వాస్తవాలు మీ దృష్టికి తెస్తున్నానని, రేవంత్‌తో తనకు ఏలాంటి విబేధాలు లేవని తెలిపారు. కేవలం పార్టీ ప్రయోజనాల దృష్ట్యా తాను ఈ లేఖ రాసినట్టు తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని