AP News: శ్రమదానానికి ఆటంకాలు అప్రజాస్వామికం: నాదెండ్ల మనోహర్
ఆంధ్రప్రదేశ్లో జనసేన పిలుపిచ్చిన శ్రమదానానికి ఆటంకాలు సృష్టించడం అప్రజాస్వామికమని ఆ పార్టీ రాజకీయ
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో జనసేన పిలుపిచ్చిన శ్రమదానానికి ఆటంకాలు సృష్టించడం అప్రజాస్వామికమని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ధ్వజమెత్తారు. రోడ్ల మరమ్మతులకు పిలుపునిస్తే పోలీసులు ఆటంకాలు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత నెల 27తేదీనే డీజీపీకి శ్రమదానం కార్యక్రమం విషయం తెలిపామన్నారు. ఇదే విషయం రాజమహేంద్రవరం అర్బన్ ఎస్పీ, అనంతపురం ఎస్పీకి కూడా తెలియజేశామని చెప్పారు.
శ్రమదానంలో పాల్గొనకుండా కార్యకర్తలను నిర్బంధిస్తున్నారని ఆయన మండిపడ్డారు. మరోవైపు నిన్న రాత్రి నుంచే పోలీసులు జనసేన అభిమానులను వివిధ పీఎస్లకు తీసుకెళ్లారు. ఈ ఉదయం కూడా పవన్ సభకు వెళ్తున్న ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన పలువురిని అదుపులోకి తీసుకొని రాజోలు, ధవళేశ్వరం పీఎస్లకు తరలించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?