TS News: శంషాబాద్‌ చేరుకున్న జేపీ నడ్డా.. ఉత్కంఠ రేపుతున్న భాజపా ర్యాలీ

భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు శంషాబాద్‌ విమానాశ్రయంలో ఆపార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. సీనియర్‌ నేతలు లక్ష్మణ్, రాజాసింగ్, విజయశాంతి, బంగారు శృతి

Updated : 04 Jan 2022 17:45 IST

హైదరాబాద్‌: భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు శంషాబాద్‌ విమానాశ్రయంలో ఆపార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, సీనియర్‌ నేతలు లక్ష్మణ్, రాజాసింగ్, విజయశాంతి, బంగారు శృతి తదితరులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. నడ్డా పర్యటన సందర్భంగా శంషాబాద్‌లో ఉద్రిక్తత నెలకొంది. బండి సంజయ్‌ అరెస్టుకు నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తామని భాజపా నేతలు ప్రకటించగా.. అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. దీంతో జేపీ నడ్డాను కలిసి ర్యాలీకి వెళ్లొద్దని కోరేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ర్యాలీకి అనుమతి లేదని జేపీ నడ్డాకు విమానశ్రయంలోనే పోలీసులు నోటీసులు ఇచ్చే అవకాశముంది. ఈ సందర్భంగా శంషాబాద్‌ విమానాశ్రయంలో భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి  తరుణ్‌ చుగ్‌, లక్ష్మణ్‌,, జితేందర్‌రెడ్డి, డీకే అరుణ, విజయశాంతి, రాంచంద్రరరావు, ప్రేమేందర్‌రెడ్డిలో జేపీ నడ్డా సమావేశమయ్యారు. బండి సంజయ్‌ అరెస్టు, అనంతర పరిణామాలను పార్టీ నేతలు నడ్డా దృష్టికి తెచ్చినట్టు సమాచారం.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని