AP News: ధూళిపాళ్ల నరేంద్రకు కాకినాడ పోలీసుల నోటీసులు

తెదేపా సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకు కాకినాడ పోలీసులు నోటీసులిచ్చారు.

Updated : 08 Oct 2021 15:20 IST

పొన్నూరు: తెదేపా సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకు కాకినాడ పోలీసులు నోటీసులిచ్చారు. డ్రగ్స్‌ రవాణా వ్యవహారంలో ఏపీ ప్రభుత్వంపై చేసిన విమర్శల నేపథ్యంలో వివరణ కోరినట్లు పోలీసులు ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం నరేంద్ర స్వగ్రామం గుంటూరు జిల్లా చింతలపూడిలోని ఆయన ఇంటికి వచ్చి నోటీసులు అందజేశారు. విచారణకు హాజరై ఆధారాలు ఇవ్వాలని సూచించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని