Kanakamedala: చంద్రబాబు ఇంటిపై దాడి.. వైకాపా కుట్రలో భాగమే: కనకమేడల
తెదేపా అధినేత చంద్రబాబు ఇంటిపై దాడి చేయడం వైకాపా కుట్రలో భాగమేనని తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ఆరోపించారు. రాజకీయ ప్రత్యర్థులను రాజకీయ శత్రువులుగా మార్చి అంతం చేయాలని కుట్ర పన్నారని తెలిపారు...
దిల్లీ: తెదేపా అధినేత చంద్రబాబు ఇంటిపై దాడి చేయడం వైకాపా కుట్రలో భాగమేనని తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ఆరోపించారు. రాజకీయ ప్రత్యర్థులను రాజకీయ శత్రువులుగా మార్చి అంతం చేయాలని కుట్ర పన్నారని తెలిపారు. దిల్లీలో కనకమేడల మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు తీసుకున్నాక విపక్ష నేతలపైనే కేసులు నమోదయ్యాయని విమర్శించారు. ప్రతిపక్ష నాయకుడిపై హత్యాయత్నం జరిగినా ఎలాంటి కేసు నమోదు చేయాలేదని ఆక్షేపించారు. సీసీ టీవీల్లో రికార్డయిన దాడి దృశ్యాలను ఎందుకు పరిశీలించలేదని ప్రశ్నించారు. ఎమ్మెల్యే జోగి రమేష్ ఏ విధంగా చంద్రబాబు నివాసానికి రాగలిగారు.. ఇందులో పోలీసులు ప్రమేయం ఏమైనా ఉందా? అనే విషయంలో డీజీపీ సమాధానం చెప్పాలని కనకమేడల డిమాండ్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!