Ap News: 3 రాజధానుల బిల్లు ఉపసంహరణ.. రైతుల తొలి విజయం: కనకమేడల
రాజధాని అంశంపై న్యాయ ప్రక్రియకు అడ్డుతగిలే కుట్రలో భాగంగానే 3 రాజధానుల బిల్లుల ఉపసంహరణ నాటకాన్ని తెరపైకి తీసుకొచ్చారని ఎంపీ కనకమేడల రవీంద్ర
అమరావతి: రాజధాని అంశంపై న్యాయ ప్రక్రియకు అడ్డుతగిలే కుట్రలో భాగంగానే 3 రాజధానుల బిల్లుల ఉపసంహరణ నాటకాన్ని తెరపైకి తీసుకొచ్చారని ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ ఆరోపించారు. 3 రాజధానుల బిల్లులో ఎన్నో చట్ట ఉల్లంఘనలు ఉన్నందునే ఏ కోర్టులోనూ ఆ బిల్లు నిలబడదని.. న్యాయస్థానంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు రానుందని ప్రభుత్వం ముందుగానే పసిగట్టిందన్నారు. పూర్తిస్థాయి బిల్లుతో మరోసారి ప్రజల ముందుకొస్తానని చెప్పిన సీఎం.. ప్రస్తుతం తీసుకొచ్చిన బిల్లు అసంపూర్తిగా ఉందని అంగీకరించినట్లేనని పేర్కొన్నారు. ఏదేమైనా 3 రాజధానుల బిల్లు ఉపసంహరణ మహాపాదయాత్రలో రైతుల తొలి విజయంగా ఆయన అభివర్ణించారు. రైతుల మహాపాదయాత్రతో ప్రభుత్వం భయపడబట్టే మద్దతు తెలిపేవారిపై అక్రమ కేసులు బనాయిస్తోందని మండిపడ్డారు. క్రమశిక్షణతో సాగుతున్న పాదయాత్రకు మద్దతు తెలిపే వారిపై పోలీసుల బెదిరింపులు సరికాదన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM