TS News: కొవిడ్ నిబంధనలు భాజపాకు మాత్రమే వర్తిస్తాయా?: కిషన్‌రెడ్డి

కొవిడ్ నిబంధనలు భాజపాకు మాత్రమే వర్తిస్తాయా అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. ఏ ప్రాతిపదికన భాజపా

Updated : 04 Jan 2022 13:47 IST

కరీంనగర్‌: కొవిడ్ నిబంధనలు భాజపాకు మాత్రమే వర్తిస్తాయా అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. ఏ ప్రాతిపదికన భాజపా కార్యాలయంపై పోలీసులు దాడి చేశారని నిలదీశారు. జాగరణ దీక్ష సందర్భంగా నెలకొన్న పరిస్థితుల వల్ల కరీంనగర్‌ జిల్లా జైలులో రిమాండ్‌ ఉన్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో మాట్లాడిన ఆయన అనంతరం సంజయ్‌ కార్యాలయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

‘‘అక్రమ కేసులకు భాజపా భయపడదు. ధర్నాచౌక్‌లో సీఎం ఆందోళన చేయవచ్చు.. ప్రతిపక్షాలు చేయకూడదా?తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ఇంత అణిచివేత లేదు. ఇలాంటి రాచరిక, నియంతృత్వ పాలన కోసమే ఉద్యమం చేశామా?దిల్లీలో ఏడాది పాటు రైతులు ఉద్యమం చేసినా కేంద్రం అడ్డుకోలేదు. భాజపా నేతలను కేసీఆర్‌ ప్రభుత్వం అక్రమ కేసులతో వేధిస్తోంది. కొవిడ్‌ నిబంధనల సాకుతో తప్పుడు కేసులు పెడుతున్నారు. కొవిడ్‌ నిబంధనలు భాజపా భవనానికి మాత్రమే వర్తిస్తాయా?’’ అని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని