TS News: కేసీఆర్ కంటే అబద్దమే ముందు పుట్టింది: కిషన్రెడ్డి
దళితబంధుపై తెరాస అసత్య ప్రచారాలు చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అన్నారు. దమ్ముంటే ఎన్నికలు ముగిసిన మరుసటి రోజే రాష్ట్రంలోని ఎస్సీలందరికీ దళితబంధు
హైదరాబాద్: దళితబంధుపై తెరాస అసత్య ప్రచారాలు చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అన్నారు. దమ్ముంటే ఎన్నికలు ముగిసిన మరుసటి రోజే రాష్ట్రంలోని ఎస్సీలందరికీ దళితబంధు అమలు చేస్తారా అని ప్రశ్నించారు. ఎన్నికలు ఏదైనా కాంగ్రెస్తో భాజపా పొత్తు పెట్టుకోదన్న ఆయన తెరాసనే ఆపని చేస్తోందన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని బూజునూరులో భాజపా అభ్యర్థి ఈటలతో కలిసి కిషన్రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘‘ఎన్నికలు వస్తే కేసీఆర్ కుటుంబానికి పూనకం వచ్చినట్టు అబద్దాలు మాట్లాడతారు. అబద్దం ముందు పుట్టి కేసీఆర్ కుటుంబం తరువాత పుట్టినట్టుంది. అంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. దళితబంధుపై అసత్య ప్రచారం చేస్తున్నారు. కేసీఆర్ గుండెమీద చెయ్యి వేసుకుని చెప్పాలి. 30వ తేదీతో ఎన్నికలు ముగుస్తాయి. ఆ మరుసటి రోజే తెలంగాణలోని ప్రతి ఒక్క దళితుడికి రూ.10లక్షలు ఇస్తారా?. కేసీఆర్ మాటమీద నిలబడే వ్యక్తి కాదు’’ అని కిషన్రెడ్డి విమర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
వైకాపాకు కొమ్ము కాస్తున్న పోలీసులు ఇకనైనా పార్టీ కండువాలు తీసి డ్యూటీ చేయాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యులు బొండా ఉమా హితవు పలికారు. -
లిక్కర్, మైనింగ్ రంగాల్లో రూ.లక్షల కోట్ల అవినీతి
రాష్ట్రంలో లిక్కర్, మైనింగ్ రంగాల్లో లక్షల కోట్ల రూపాయల మేర అవినీతి జరుగుతోందని భాజపా రాష్ట్ర ఎన్నికల సహ ఇన్ఛార్జ్ సిద్ధార్థ్నాథ్సింగ్ ధ్వజమెత్తారు. -
బ్యాలెట్ బాక్సులతోనే ‘స్థానిక’ ఎన్నికలు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఎన్నికలను బ్యాలెట్ బాక్సులతో నిర్వహించాలని నిర్ణయించింది.
తాజా వార్తలు (Latest News)
-
రూ. 120 కోట్లకు పైగా అక్రమార్జన.. ఎట్టకేలకు చిక్కిన స్క్రాప్ మాఫియా డాన్
-
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
నాలుగో రోజూ లాభాల్లో.. 22,400 ఎగువన నిఫ్టీ
-
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
-
ఎన్నికలను మేం నియంత్రించలేం: ‘వీవీప్యాట్’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు