Ap News: కుప్పంలో చంద్రబాబు గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: కొడాలి నాని

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ప్రజలు దీవిస్తుంటే తెదేపా అధినేత చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని మంత్రి కొడాలి నాని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా

Published : 22 Sep 2021 02:11 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ప్రజలు దీవిస్తుంటే తెదేపా అధినేత చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని మంత్రి కొడాలి నాని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 99 శాతం జడ్పీటీసీలు, 85 శాతం ఎంపీటీసీ స్థానాలను వైకాపా కైవసం చేసుకుందన్నారు. కుప్పం, నారావారిపల్లె, నిమ్మకూరులోనూ వైకాపా గెలిచిందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తెదేపాకు అభ్యర్థులు దొరికే పరిస్థితి ఉండదని వెల్లడించారు. కుప్పంలో చంద్రబాబును తప్పకుండా ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కుప్పంలో చంద్రబాబు గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని కొడాలి నాని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని