TS News: రేపు తెరాసలోకి కౌశిక్ రెడ్డి
హుజూరాబాద్ నాయకుడు కౌశిక్ రెడ్డి అధికార పార్టీ తెరాసలో చేరనున్నారు.
హైదరాబాద్: హుజూరాబాద్ నాయకుడు కౌశిక్ రెడ్డి అధికార పార్టీ తెరాసలో చేరనున్నారు. రేపు మధ్యాహ్నం తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ సమక్షంలో చేరేందుకు ఆయన నిర్ణయం తీసుకున్నారు. కౌశిక్రెడ్డి ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
హుజూరాబాద్ అభివృద్ధికే తెరాసలోకి: కౌశిక్
హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను తెరాసలో చేరుతున్నట్లు కౌశిక్రెడ్డి తెలిపారు. రేపు మధ్యాహ్నం ఒంటిగంటకు తెరాసలో చేరుతానని వెల్లడించారు. కొండాపూర్లోని నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన మాట్లాడారు. ‘‘పెద్దఎత్తున నా సైనికులు రేపు తెలంగాణ భవన్కు రావాలని కోరుతున్నా. సీఎం కేసీఆర్ కృషితో రైతులంతా సంతోషంగా ఉన్నారు. కాళేశ్వరం, ఎల్ఎండీ జలాలతో సమృద్ధిగా పంటలు పండుతున్నాయి. రైతుల సంక్షేమం కోసం కేసీఆర్ ఎన్నో పథకాలు తెచ్చారు. ఈటల రాజేందర్ హుజూరాబాద్ అభివృద్ధిని విస్మరించారు. ప్రజా సమస్యల కోసం కాదు.. స్వలాభం కోసం ఆయన రాజీనామా చేశారు’ అని కౌశిక్ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై బదిలీ వేటు
-
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?
-
బ్రిటన్కు అక్రమంగా వస్తే రువాండాకే.. అసలేమిటీ బిల్లు?
-
ఓటీపీ రూటు మారితే అలర్ట్.. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు కొత్త అస్త్రం!