KTR: ధర్నాల కోసం కలెక్టర్ల అనుమతి తీసుకోండి: కేటీఆర్
ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర వైఖరికి నిరసనగా నియోజకవర్గ కేంద్రాల్లో ఈ నెల 12న ధర్నాకు తెరాస పిలుపునిచ్చిన నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ఆ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
హైదరాబాద్: ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర వైఖరికి నిరసనగా నియోజకవర్గ కేంద్రాల్లో ఈ నెల 12న ధర్నాకు తెరాస పిలుపునిచ్చిన నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ఆ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా ధర్నాల కోసం కలెక్టర్ల నుంచి అనుమతి తీసుకోవాలన్నారు. కలెక్టర్ల అనుమతితోనే ధర్నాలు నిర్వహించాలని కేటీఆర్ పార్టీ శ్రేణులకు వివరించారు. మరోవైపు రైతులకు సంఘీభావంగా తెరాస ఈ నెల 12న హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద ధర్నా నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో ధర్నా చౌక్ను మంత్రులు తలసాని, మహమూద్ అలీ పరిశీలించారు. వారి వెంట ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, వెంకటేశ్వర్లు, దానం నాగేందర్ ఉన్నారు.
ఈ సందర్భంగా తలసాని మీడియాతో మాట్లాడారు. ‘‘ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర వైఖరికి నిరసనగా ధర్నా చేస్తున్నాం. సాగు చట్టాలతో రైతులను కేంద్ర ఇబ్బంది పెడుతోంది. ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు పరం చేసేందుకు కేంద్రం కుట్ర చేస్తోంది. రాష్ట్ర భాజపా నేతలు వరి పండించాలని చెబుతున్నారు. ధాన్యం కొనుగోలు చేయబోమని కేంద్రం చెబుతోంది. భాజపా నాయకులది రెండు నాయకుల ధోరణి’’ అని తలసాని విమర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని