Ap News: కర్నూలు జడ్పీ ఛైర్మన్ మల్కిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి రాజీనామా
కర్నూలు జిల్లా పరిషత్ ఛైర్మన్ మల్కిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను జిల్లా కలెక్టరు కోటేశ్వరరావుకు...
కర్నూలు: కర్నూలు జిల్లా పరిషత్ ఛైర్మన్ మల్కిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను జిల్లా కలెక్టరు కోటేశ్వరరావుకు అందించారు. కేవలం వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు సుబ్బారెడ్డి తెలిపారు. ఆయన రాజీనామా చేయడంతో ఆ పదవి ఎర్రబోతుల పాపిరెడ్డికి వచ్చే అవకాశం ఉంది. ఎర్రబోతుల వెంకటరెడ్డికి ఛైర్మన్ పదవి ఇస్తానని గతంలో సీఎం జగన్ హామీ ఇచ్చారు. కరోనా కారణంగా వెంకటరెడ్డి మృతిచెందారు. దీంతో ఆయన కుమారుడు పాపిరెడ్డి ఉప ఎన్నికలో గెలిచారు. పాపిరెడ్డి కోసం మల్కిరెడ్డిని పార్టీ అధిష్ఠానం రాజీనామా చేయించినట్లు తెలుస్తోంది.
జడ్పీ ఛైర్మన్గా వెంకట సుబ్బారెడ్డి ఈ ఏడాది సెప్టెంబరు 25న బాధ్యతలు చేపట్టారు. గత నెలలో జడ్పీ స్థాయీ సంఘ ఎన్నికలు నిర్వహించారు. ఈ నెలలో సర్వసభ్య సమావేశానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో కొత్త సమస్య మొదలైంది. జడ్పీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేయాలని వైకాపాకు చెందిన కొందరు నేతలు ఒత్తిడి చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రితో స్వయంగా మాట్లాడిన తర్వాత రాజీనామా చేస్తానని సుబ్బారెడ్డి ప్రకటించడం పార్టీలో చర్చనీయాంశమైంది. సీఎం ఆదేశిస్తే తాను రాజీనామా చేస్తానని, లేకుంటే కొనసాగుతానని వెంకట సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
వైకాపాకు కొమ్ము కాస్తున్న పోలీసులు ఇకనైనా పార్టీ కండువాలు తీసి డ్యూటీ చేయాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యులు బొండా ఉమా హితవు పలికారు. -
లిక్కర్, మైనింగ్ రంగాల్లో రూ.లక్షల కోట్ల అవినీతి
రాష్ట్రంలో లిక్కర్, మైనింగ్ రంగాల్లో లక్షల కోట్ల రూపాయల మేర అవినీతి జరుగుతోందని భాజపా రాష్ట్ర ఎన్నికల సహ ఇన్ఛార్జ్ సిద్ధార్థ్నాథ్సింగ్ ధ్వజమెత్తారు. -
బ్యాలెట్ బాక్సులతోనే ‘స్థానిక’ ఎన్నికలు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఎన్నికలను బ్యాలెట్ బాక్సులతో నిర్వహించాలని నిర్ణయించింది.
తాజా వార్తలు (Latest News)
-
యూట్యూబ్కు పోటీగా.. వీడియోల కోసం ‘ఎక్స్’ టీవీ యాప్!
-
విజయ్తో సినిమా కష్టమే..: వెట్రిమారన్
-
ఆ ఇద్దరికి నో ప్లేస్.. వన్డౌన్ బ్యాటర్గా అతడే: ఇర్ఫాన్ పఠాన్
-
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ
-
ప్రమాదవశాత్తు పేలిన తుపాకీ.. సీఆర్పీఎఫ్ డీఎస్పీ మృతి
-
వారసత్వ ఆస్తుల్నీ వదలరట: పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ విమర్శలు