Huzurabad Bye Election: కొండా సురేఖ అభ్యర్థిత్వానికే మెజారిటీ నేతల మొగ్గు!
గాంధీభవన్లో రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యనేతలతో టీపీసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణికం ఠాగూర్ భేటీ అయ్యారు.
హైదరాబాద్: గాంధీభవన్లో రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యనేతలతో టీపీసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణికం ఠాగూర్ భేటీ అయ్యారు. హుజూరాబాద్ ఉప ఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక, గజ్వేల్లో దళిత, గిరిజన ఆత్మగౌరవ సభ నిర్వహణపై సమావేశంలో చర్చిస్తున్నారు. హుజూరాబాద్ ఎన్నిక కోసం ఇప్పటికే కొండా సురేఖ, సదానంద, కృష్ణారెడ్డి పేర్లతో ఎన్నికల నిర్వహణ కమిటీ మాణికం ఠాగూర్కు జాబితా అందజేసింది. ఈ నేపథ్యంలో ఆ ముగ్గురు పేర్లపై నేతల అభిప్రాయాన్ని ఆయన సేకరిస్తున్నారు.
సమావేశంలో కొండా సురేఖ అభ్యర్థిత్వానికే మెజారిటీ నేతలు మద్దతు తెలిపినట్లు సమాచారం. సమావేశంలో మెజారిటీ నేతల అభిప్రాయాన్ని క్రోడీకరించి తుది జాబితాను కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి మాణికం ఠాగూర్ అందజేయనున్నారు. ఈ సమావేశం తర్వాత హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనేదానిపై దాదాపు స్పష్టత వచ్చే అవకాశముంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!