TS News: తలసరి విద్యుత్‌ వినియోగంలో రాష్ట్రానిది మూడో స్థానం: జగదీశ్‌రెడ్డి

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. సభలో పలు విషయాలపై ప్రశ్నోత్తరాలు జరుగుతున్నాయి.

Updated : 05 Oct 2021 13:55 IST

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. సభలో పలు విషయాలపై ప్రశ్నోత్తరాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పలువురు సభ్యులు విద్యుత్‌కు సంబంధించి అడిగిన ప్రశ్నలకు ఆ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి సమాధానమిచ్చారు. రాష్ట్ర ఆవిర్భావ సమయంలో ఉన్న విద్యుత్‌ సమస్యను కేవలం మూడు నెలల్లోనే పరిష్కరించినట్లు తెలిపారు. మూడేళ్లలోనే రైతులకు 24 గంటల విద్యుత్‌ను అందించినట్లు వివరించారు. తలసరి విద్యుత్‌ వినియోగంలో దేశంలో మూడో స్థానంలో రాష్ట్రం నిలిచిందని చెప్పారు. విద్యుత్‌ రంగంలో రాష్ట్ర పురోభివృద్ధికి సీఎం కేసీఆర్‌ దార్శనికతే కారణమని మంత్రి తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని