Huzurabad By election: ధరల పెరుగుదల పాపం ముమ్మాటికీ భాజపాదే: హరీశ్‌రావు

కేంద్రంలోని భాజపా ప్రభుత్వం అన్నింటి ధరలు పెంచుతూ సామాన్యులపై భారం వేస్తోందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. ..

Updated : 24 Sep 2022 14:25 IST

హుజూరాబాద్: కేంద్రంలోని భాజపా ప్రభుత్వం అన్నింటి ధరలు పెంచుతూ సామాన్యులపై భారం వేస్తోందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. ధరల పెరుగుదల పాపం ముమ్మాటికీ భాజపాదే అని అన్నారు. తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు మద్దతుగా మంత్రి హరీశ్ రావు హుజూరాబాద్ నియోజకవర్గంలోని మాచనపల్లిలో ప్రచారం నిర్వహించారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తూనే భాజపా, కాంగ్రెస్ నాయకుల విమర్శలను తనదైన శైలిలో తిప్పికొట్టారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో భాజపా, కాంగ్రెస్  కుమ్మక్కయ్యాయని విమర్శించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని