Ts politics: భాజపాకు షాక్ ఇచ్చేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారు: జగదీశ్రెడ్డి
తెలంగాణ నుంచి పన్నుల రూపంలో రూ.వేల కోట్లు కేంద్రానికి వెళ్తున్నా.. రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులే సక్రమంగా ఇవ్వట్లేదని రాష్ట్రమంత్రి జగదీశ్రెడ్డి విమర్శించారు. తెలంగాణ
హైదరాబాద్: తెలంగాణ నుంచి పన్నుల రూపంలో రూ.వేల కోట్లు కేంద్రానికి వెళ్తున్నా.. రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులే సక్రమంగా ఇవ్వట్లేదని రాష్ట్రమంత్రి జగదీశ్రెడ్డి విమర్శించారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... మిషన్ భగీరథ చక్కని పథకం, నిధులు ఇవ్వాలని నీతిఆయోగ్ చెప్పినా కేంద్రం స్పందించలేదన్నారు. కేంద్రమంత్రి గానీ, భాజపా ఎంపీలు గానీ రాష్ట్రానికి నిధులేమైనా తెచ్చారా అని ప్రశ్నించారు. ‘‘దేశ ప్రజల నెత్తిమీద రోజుకో బండ వేస్తున్నదెవరు? పెట్రోల్, డీజిల్ ధర వందకు పైగా చేసిందెవరు? భాజపాకు షాక్ ఇచ్చేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారు. భాజపా ఎన్నికల మేనిఫెస్టో, తెరాస మేనిఫెస్టో ప్రజలముందు పెట్టి చర్చ చేద్దామా? అందుకు కిషన్రెడ్డి సిద్ధమా? పార్లమెంట్లో ఎవరు ఏ ప్రశ్న అడిగినా తెలంగాణకు పొగడ్తలే తప్ప .. నిధులు ఇచ్చింది లేదు. భాజపా నేతలు పార్లమెంట్లో ఓ విధంగా.. మీడియా ఎదుట మరో విధంగా మాట్లాడుతున్నారు’’ అని జగదీశ్రెడ్డి విమర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
రివ్యూ: ఆర్టికల్ 370.. యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?