AP News: తెదేపా జాతీయ పార్టీ ఎలా అయిందో ఎవరికీ తెలియదు: కన్నబాబు

ఏపీలో అశాంతి సృష్టించాలని తెదేపా చూస్తోందని వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు ఆరోపించారు

Updated : 23 Oct 2021 13:37 IST

గుంటూరు: ఏపీలో అశాంతి సృష్టించాలని తెదేపా చూస్తోందని వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు ఆరోపించారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెదేపా అధినేత చంద్రబాబు చేసిన 36 గంటల దీక్షలో ఆ పార్టీ నేతల చేత సీఎంను తిట్టించారన్నారు. తెదేపా జాతీయ పార్టీ ఎలా అయిందో ఎవరికీ తెలియదని ఎద్దేవా చేశారు. బద్వేలు, హుజూరాబాద్‌లో తెదేపా ఎందుకు పోటీ చేయట్లేదని ప్రశ్నించారు. సీఎంను తిట్టిన పదంతో రాష్ట్రపతి, ప్రధానిని సంబోధించగలరా అని కన్నబాబు నిలదీశారు. సీఎం జగన్‌పై బురద జల్లేందుకే చంద్రబాబు దిల్లీ పర్యటన అని ఆరోపించారు. సంక్షేమ పథకాలు అడ్డుకునే ఉగ్రవాదం తెదేపా చేస్తోందని ఆయన మండిపడ్డారు. వ్యవసాయశాఖలో ఏ సంస్థనూ మూసివేయట్లేదని స్పష్టం చేశారు. ఆగ్రోస్‌ సంస్థ మూతపడదని చెప్పారు. వ్యవసాయ యాంత్రీకరణ మరింత బతోపేతం చేస్తామని కన్నబాబు వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని