Kodali nani: పవన్ అరిచే అరుపులకు బెదిరిపోయే ప్రసక్తేలేదు: కొడాలి నాని
సినిమా టికెట్ల ధరలు అమాంతంగా పెంచేసి కొందరు నిర్మాతలు చేస్తున్న దోపిడీని కట్టడి చేసేందుకే కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. దర్శకుడు జొన్నలగడ్డ శ్రీనివాస్ తనయుడు హరికృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న ‘‘ఆటో రజినీ’’ చిత్ర ప్రారంభోత్సవానికి కొడాలి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు....
హైదరాబాద్: సినిమా టికెట్ల ధరలు అమాంతంగా పెంచేసి కొందరు నిర్మాతలు చేస్తున్న దోపిడీని కట్టడి చేసేందుకే కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. దర్శకుడు జొన్నలగడ్డ శ్రీనివాస్ తనయుడు హరికృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న ‘‘ఆటో రజినీ’’ చిత్ర ప్రారంభోత్సవానికి కొడాలి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
‘‘చిన్న సినిమాలను బతికించేందుకు మార్పు అనివార్యమైంది. సినీ పరిశ్రమ అంటే నలుగురు నిర్మాతలు మాత్రమే కాదు. ఒకరు బెదిరిస్తే ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లో బెదిరిపోయే ప్రసక్తే లేదు. రాష్ట్ర ప్రభుత్వం కమిటీ వేసి.. ఎక్కడ ఏ విధమైన రేట్లు ఉండాలనే విధానంపై నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ప్రకారమే సినిమా టికెట్లు అమ్మాలని ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. ఈ విషయంలో నిర్మాతలు హైకోర్టును ఆశ్రయించారు. కమిటీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని హైకోర్టు సైతం తెలిపింది. కేవలం ఒక వ్యక్తి లేదా ఒక సినిమాను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోలేదు. సినీ పరిశ్రమను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకుంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ అరిచినంత మాత్రాన అదిరిపోయి, బెదిరిపోయి పారిపోయేది కాదు రాష్ట్ర ప్రభుత్వం. సీఎం జగన్మోహన్రెడ్డికి ఎవరి మద్దతు అవసరం లేదు. ఆయనకు భగవంతుడి మద్దతు ఉంది’’ అని కొడాలి నాని అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...