కార్యకర్తల కుటుంబాలకు కేసీఆర్‌ పెద్దదిక్కుగా ఉంటారు: కేటీఆర్‌

కార్యకర్తల కుటుంబాలకు సీఎం కేసీఆర్‌ పెద్ద దిక్కుగా ఉంటారని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ భరోసా ఇచ్చారు. మరణించిన తెరాస కార్యకర్తల కుటుంబాలకు

Published : 05 Aug 2021 01:48 IST

హైదరాబాద్‌: కార్యకర్తల కుటుంబాలకు సీఎం కేసీఆర్‌ పెద్ద దిక్కుగా ఉంటారని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ భరోసా ఇచ్చారు. మరణించిన తెరాస కార్యకర్తల కుటుంబాలకు బీమా చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. బాధిత కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున చెక్కులను అందించిన కేటీఆర్‌ .. తన దృష్టికి తెచ్చిన సమస్యలను 15 రోజుల్లో  పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కార్యకర్తల కుటుంబ సభ్యులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. కేసీఆర్‌ నాయకత్వంలో మరింత కష్టపడి పనిచేద్దామని కేటీఆర్‌ పిలుపునిచ్చారు. 60 లక్షల సభ్యత్వం కలిగిన అజేయశక్తిగా తెరాస పార్టీ ఎదిగిందన్నారు. 60 లక్షల మంది కుటుంబ సభ్యులు టీఆర్‌ఎస్‌ పార్టీ కుటుంబమేనన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని