Ts News: అక్కడి అభివృద్ధిపై మాట్లాడే అర్హత కాంగ్రెస్‌ నేతలకు లేదు: నిరంజన్‌రెడ్డి

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి సాగునీరు అందించిన ఘనత తెరాస ప్రభుత్వానికే దక్కుతుందని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌...

Updated : 14 Oct 2021 13:46 IST

హైదరాబాద్‌‌: ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి సాగునీరు అందించిన ఘనత తెరాస ప్రభుత్వానికే దక్కుతుందని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి అన్నారు. తెరాస శాసనసభాపక్ష కార్యాలయంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి నిరంజన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ నేతలకు పాలమూరు అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. ఏళ్ల తరబడి పాలించి కృష్ణా నదిపై ప్రాజెక్టులు కట్టలేదన్నారు. తెదేపాలో ఉన్నప్పుడు కాంగ్రెస్‌ కారణంగానే పాలమూరు జిల్లా నాశనం అయిందని విమర్శించిన రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు తెరాసపై అసత్యాలు చెబుతున్నారని నిరంజన్‌ రెడ్డి ధ్వజమెత్తారు.

మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. ‘‘80 వేల నియామకాలు చేపడతామని ఉద్యోగ నియామకాలపై అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ఏటా ఉద్యోగాలపై క్యాలెండర్‌ విడుదల చేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు ఇచ్చిన హామీలన్నీ తెరాస ప్రభుత్వం అమలు చేసింది. ప్రైవేటు రంగంలో 15 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. హైదరాబాద్‌కు అనేక కంపెనీలు వచ్చాయి’’ అని అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు