Ts News: దశలవారీగా రాష్ట్రమంతా దళితబంధు అమలు: సీఎం కేసీఆర్
రైతుబంధు పథకం యథావిధిగా కొనసాగుతుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. దళితబంధుపై విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని.. వాటి దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. ఈ పథకాన్ని దశలవారీగా రాష్ట్రమంతా...
హైదరాబాద్: రైతుబంధు పథకం యథావిధిగా కొనసాగుతుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. దళితబంధుపై విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని.. వాటి దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. ఈ పథకాన్ని దశలవారీగా రాష్ట్రమంతా అమలు చేస్తామని వెల్లడించారు. కష్టపడి పనిచేయాలని.. నిరంతరం ప్రజల్లో ఉండాలని ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెరాస విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ధాన్యం కొనుగోళ్లు, గనుల ప్రైవేటీకరణ, ఇతర అంశాలపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. కేంద్రంపై పోరులో భవిష్యత్తు కార్యాచరణపై నేతలకు సీఎం దిశానిర్దేశం చేశారు.
సమావేశం ముగిసిన అనంతరం మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ భేటీలో చర్చించిన అంశాలను వివరించారు. ‘‘కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల తెలంగాణలో రైతులు బాధపడుతున్నారు. పార్లమెంట్లోనూ తెరాస సభ్యులు రైతుల సమస్యలపై పోరాటం చేస్తున్నారు. కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలను తెరాస ఎంపీలు ఉభయసభల్లో ప్రశ్నిస్తున్నారు. కేంద్రం ఈసారి వానాకాలం ధాన్యం కొనుగోలు కోటాను భారీగా తగ్గించింది. ధాన్యం సేకరణపై కేంద్రం ఇచ్చిన లక్ష్యం ఇప్పటికే పూర్తి చేశాం. రాష్ట్రంలో సేకరించాల్సిన ధాన్యం ఇంకా చాలా ఉంది. ఇంకా సగం పంట కల్లాలు, పొలాల్లోనే ఉంది. మిగిలిపోయిన ధాన్యాన్ని ఏం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. దిల్లీకి వెళ్లి కేంద్రాన్ని మరోసారి నిలదీయాలని భావిస్తున్నాం. రా రైస్ ఎంతైనా కొంటామని హామీ ఇచ్చిన కేంద్రం ఇప్పుడు ఎందుకు కొనట్లేదు?కేంద్ర ప్రభుత్వానిది బాధ్యతారాహిత్యం. గోదాములు, వ్యాగన్లు ఖాళీ లేవంటూ ఎఫ్సీఐ బియ్యం తరలించట్లేదు. రాష్ట్రంలో 65 లక్షల హెక్టార్లలో పంట దిగుబడి వచ్చింది. తెరాస ఎంపీలతో కలిసి ఆరుగురు మంత్రుల బృందం రేపు దిల్లీకి వెళ్లాలని నిర్ణయించాం’’ అని మంత్రి వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని