
Ts News: ప్రేమలేఖలు రాసేందుకు వచ్చినట్లు కేంద్ర మంత్రులు భావిస్తున్నారు: నిరంజన్రెడ్డి
దిల్లీ: కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తోన్న విధానాల వల్ల రైతులు బాధపడే పరిస్థితి వచ్చిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. దిల్లీలో మంత్రి నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అనేక శాఖలు తెలంగాణ పురోగతిని ప్రశంసించాయన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా రాజ్యంగపరమైనదే అనే విషయాన్ని రాష్ట్ర భాజపా నేతలు మర్చిపోతున్నారని మండిపడ్డారు. కేంద్రంలోని భాజపా కార్పొరేట్ కంపెనీలకు ఏమైనా చేస్తోందని.. దగ్గరుండి మరీ కంపెనీలకు ఒప్పందాలు కుదుర్చి ఇస్తోందన్నారు. మరి రైతులను ఎందుకు విస్మరిస్తోందని నిలదీశారు. ధాన్యం సమస్య పరిష్కారం కోసం దిల్లీలో పడిగాపులు కాస్తున్నామని.. రెండు రోజుల్లో నిర్ణయం చెప్తామని ఇంత వరకు చెప్పలేదని అసహనం వ్యక్తం చేశారు. ఏదో ప్రేమలేఖలు రాసేందుకు దిల్లీకి వచ్చినట్లు కేంద్ర మంత్రులు భావిస్తున్నారని ఆక్షేపించారు.
‘‘దాదాపు 20 ఉత్పత్తులకే కేంద్రం నామమాత్రపు ఎంఎస్పీ ఇస్తోంది. స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేస్తామని ప్రధాని మోదీ చెప్పారు. ఇప్పటివరకు వాటిని అమలు చేయలేదు. ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించడం లేదు. యూపీ, పంజాబ్ రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని సాగు చట్టాలను వెనక్కి తీసుకున్నారు. ఏటా 2 కోట్ల ఉద్యోగ అవకాశాలను కల్పిస్తామని మోదీ హామీ ఇచ్చారు. బ్యాంకు రుణాలు ఎగవేస్తున్న పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్నారు. రైతులు, కొత్తతరం వారు వ్యవసాయాన్ని విడిచిపెట్టేలా మోదీ వ్యవహరిస్తున్నారు. ప్రోత్సహిస్తే రాష్ట్రంలో యాసంగిలోనూ 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుంది. గుజరాత్లో సాగుకు 24 గంటల విద్యుత్ ఇస్తున్నారా?
ఏ విషయంలోనూ కేంద్రం నుంచి సరైన విధంగా సాయం అందడం లేదు. రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ నిధులను కూడా అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. కేంద్రం నిర్వర్తించాల్సిన బాధ్యతను వదిలేసి.. రాష్ట్రాలపైకి దాడి చేయడం ఏంటని ప్రశ్నించారు. అడిగేందుకు వచ్చిన రాష్ట్రాల నేతలను అవమానిస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డిని ఒకటే విషయం అడుగుతున్నాం. ప్రధానమంత్రితో మాట్లాడి.. ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర ప్రజలకు భరోసా కల్పించలేరా? ఇదేమీ చేయకుండా సీఎం కేసీఆర్ను తిట్టడం.. తెలంగాణను తిట్టడం.. అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారు. కేంద్రం తన వైఖరేంటో ఇప్పటికైనా స్పష్టంగా చెప్పాలి’’ అని నిరంజన్రెడ్డి డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Maharashtra crisis: బల పరీక్షలో నెగ్గేది మేమే.. ఎవరూ ఆపలేరు: ఏక్నాథ్ శిందే
-
General News
Rythu Bandhu: పదెకరాలకు పైగా ఉన్నవారికి మొత్తంగా ఇస్తోంది ₹250 కోట్లే: నిరంజన్రెడ్డి
-
Movies News
Hema Chandra - Sravana Bhargavi: విడాకుల వార్తలపై హేమచంద్ర, శ్రావణ భార్గవి క్లారిటీ
-
World News
Boris Johnson: ‘పుతిన్ ఓ మహిళే అయితే’.. రష్యా అధ్యక్షుడిపై బ్రిటన్ ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Business News
Reliance Retail: రిలయన్స్ రిటైల్ రారాణిగా ఈశా అంబానీ?
-
World News
UN: ‘పాత్రికేయుల్ని జైలుపాలు చేయొద్దు’.. జుబైర్ అరెస్టుపై స్పందించిన ఐరాస
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Actress Meena: ఊపిరితిత్తుల సమస్యతో నటి మీనా భర్త మృతి
- Archana Shastry: అందుకే ‘మగధీర’లో నటించలేదు.. అర్చన కన్నీటి పర్యంతం
- Actress Meena: మీనా భర్త మృతి.. పావురాల వ్యర్థాలే కారణమా..?
- Udaipur Murder: భగ్గుమన్న ఉదయ్పుర్
- Plastic Ban: జులై 1 నుంచి దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ నిషేధం.. ఏయే వస్తువులంటే..!
- DilRaju: తండ్రైన దిల్రాజు.. మగబిడ్డకు జన్మనిచ్చిన తేజస్విని
- ఒత్తిళ్లకు లొంగలేదని బదిలీ బహుమానం!
- IND vs IRE : అందుకే ఆఖరి ఓవర్ను ఉమ్రాన్కు ఇచ్చా : హార్దిక్ పాండ్య
- IND vs IRE : గెలిచారు.. అతి కష్టంగా
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (29-06-22)