Ts News: మరో 20ఏళ్లపాటు అధికారంలో తెరాస: శ్రీనివాస్‌గౌడ్‌

తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ విజయవంతం కావడంతో ప్రతిపక్షాలకు కడుపుమంటగా ఉందని మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ అన్నారు. ప్లీనరీ నిర్వహణతో తెరాస మరో 20ఏళ్లపాటు

Updated : 30 Sep 2022 14:34 IST

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ విజయవంతం కావడంతో ప్రతిపక్షాలకు కడుపుమంటగా ఉందని మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ అన్నారు. ప్లీనరీ నిర్వహణతో తెరాస మరో 20ఏళ్లపాటు అధికారంలో ఉంటుందనే భరోసా కలిగిందన్నారు. సీఎం కేసీఆర్‌ లాంటి నాయకుడు తమకు కావాలని ఏపీ సహా పలు రాష్ట్రాల ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. బీసీ గణన జరిగితే వెనకబడిన వర్గాలు అభివృద్ధి చెందుతాయనే కాంగ్రెస్‌, భాజపాలకు సీఎం కేసీఆర్ అంటే భయమన్నారు. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ సమర్థుడు కనుకనే సదస్సులో ప్రసంగించాలని ఫ్రాన్స్‌ దేశం ఆహ్వానించిందని.. ఇందులో పైరవీలు ఉంటాయా? అని మంత్రి ప్రశ్నించారు. దళితబంధును చూసి ఓర్వలేకే ఒక్కొక్కరు ఒక్కో తీరుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. అన్ని వర్గాలకు తెరాస పాలనలో మేలు జరుగుతోందన్నారు. తమ పునాదులు కదిలిపోతాయనే భయంతోనే ప్రతిపక్ష నేతలు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కొందరు బహిరంగ చర్చ అంటున్నారని.. ఎన్నికలుండగా ఇంకా చర్చలెందుకన్నారు. ఎన్నికలే ప్రజాస్వామ్యానికి కొలమానమని.. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఫలితమే ఎవరేంటనేది తేలుస్తుందన్నారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో తెరాస గెలుపు ఖాయమన్నారు. ఉద్యోగ నియామకాలపై త్వరలోనే ప్రక్రియ మొదలవుతుందని మంత్రి తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని