TS News: దేశానికే ఆదర్శంగా విజయ డెయిరీ: మంత్రి తలసాని

విజయ డైయిరీని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌

Updated : 30 Sep 2022 14:42 IST

హైదరాబాద్‌: విజయ డెయిరీని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ తెలిపారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా శాసన మండలిలో మంత్రి మాట్లాడారు.  మెగా డెయిరీ  ప్రాజెక్టుల ఏర్పాటుపై ఎమ్మెల్సీలు జీవన్‌రెడ్డి, ప్రభాకర్‌రావు అడిగిన ప్రశ్నలకు తలసాని సమాధానమిచ్చారు. కరీంనగర్‌ జిల్లా పాడి రైతులకు రూ.4 ప్రోత్సాహకం అందడం లేదని జీవన్‌రెడ్డి మండలి దృష్టికి తీసుకొచ్చారు. 

కరీంనగర్‌, ముల్కనూరు, నల్గొండ పాడి రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతోనే 50 శాతం రాయితీతో పాడి పశువులను పంపిణీ చేస్తున్నామని మంత్రి చెప్పారు. రాష్ట్రంలో పాల సేకరణ లక్ష లీటర్ల నుంచి నాలుగున్నర లక్షల లీటర్లకు పెంచామన్నారు. 35వేలుగా ఉన్న పాడిరైతుల సంఖ్య.. తెరాస పాలనలో 1.32లక్షలకు చేరిందన్నారు. రావిర్యాల ప్రాంతంలో మెగా డెయిరీని ప్రారంభిస్తున్నామని తలసాని వివరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు