AP News: అశోక్కు.. ఇవ్వాల్సిన మర్యాదలన్నీ ఇచ్చాం: వెల్లంపల్లి
విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థం బోడికొండపై కేంద్ర మాజీ మంత్రి, తెదేపా సీనియర్ నేత అశోక్ గజపతి రాజు వీరంగం సృష్టించారని మంత్రి వెల్లంపల్లి ..
అమరావతి: విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థం బోడికొండపై కేంద్ర మాజీ మంత్రి, తెదేపా సీనియర్ నేత అశోక్ గజపతి రాజు వీరంగం సృష్టించారని మంత్రి వెల్లంపల్లి ఆరోపించారు. ప్రోటోకాల్ ప్రకారమే శిలా ఫలకంపై పేర్లు రాయించామని చెప్పారు. ఆలయ ధర్మకర్తకు ఇవ్వాల్సిన అన్ని మర్యాదలు ఇచ్చామని వివరించారు. బోడికొండపై కోదండరాముడి ఆలయ శంకుస్థాపన కార్యక్రమంలో ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో వెల్లంపల్లి ఈ మేరకు స్పందించారు. రాముడి విగ్రహం ధ్వంసం ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. ఎట్టిపరిస్థితుల్లో వచ్చే శ్రీరామనవమికి ఆలయ నిర్మాణం పూర్తవుతుందన్నారు. రామతీర్థం ఆలయాల అభివృద్ధికి రూ.4కోట్లు వెచ్చిస్తున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఆలయాలు అభివృద్ధి చేస్తున్నామని వెల్లంపల్లి వివరించారు.
అనంతరం మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడారు. ‘‘అశోక్ లాంటి పెద్ద వ్యక్తి ఇలా ప్రవర్తించడం సరికాదు. ఆలయ అభివృద్ధికి ప్రభుత్వానికి ఒక్క లేఖ కూడా రాయలేదు. మనం ఎవరి రాచరిక వ్యవస్థలో లేము.. ప్రజాస్వామ్యంలో ఉన్నాం. శంకుస్థాపనకు పిలవడానికి వెళ్లిన ఈవో, ప్రధాన అర్చకులను తిట్టారు. రామతీర్థం ఆలయాన్ని రెండో భద్రాద్రి చేయడానికి సిద్ధంగా ఉన్నాం’’ బొత్స అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
కాంగ్రెస్ నేత, ఛింద్వాడా సిట్టింగ్ ఎంపీ నకుల్ నాథ్ ఇటీవల నామినేషన్ వేసిన సందర్భంగా సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలు ప్రకటించారు. -
పదేళ్ల ‘రిపోర్టు కార్డ్’ చూపించండి.. స్మృతి ఇరానీకి కాంగ్రెస్ ప్రశ్న
మహిళలకు సంబంధించిన సమస్యలపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మౌనంగా ఉంటున్నారని.. గడిచిన పదేళ్లలో ‘రిపోర్టు కార్డు’ను బయటపెట్టాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్