AP News: హిందూపురం ప్రభుత్వాసుపత్రిలో బాలకృష్ణ ఆకస్మిక తనిఖీలు

అనంతపురం జిల్లా హిందూపురం ప్రభుత్వాసుపత్రిలో స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆకస్మిక తనిఖీలు చేశారు.

Updated : 18 Oct 2021 15:07 IST

హిందూపురం: అనంతపురం జిల్లా హిందూపురం ప్రభుత్వాసుపత్రిలో స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆకస్మిక తనిఖీలు చేశారు. ప్రభుత్వాసుపత్రిలో అందుతున్న సేవలు, సౌకర్యాల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. కాగా, వైద్యసేవలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. సరైన వైద్యం అందట్లేదని రోగుల నుంచి చాలా ఫిర్యాదులు వచ్చాయన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో పరిస్థితులు చాలా అధ్వానంగా ఉన్నాయని తెలిపారు. ఆస్పత్రి పరిస్థితులపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తానని బాలకృష్ణ చెప్పారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని