Ts News: అదే భాషను అమిత్ షా కుమారుడిపై వాడితే సమర్థిస్తారా?: ఎమ్మెల్యే జీవన్రెడ్డి
రాష్ట్ర మంత్రులను అవమానించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్కు వకాల్తా పుచ్చుకొని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి భాజపా బంట్రోతులా మారిపోయారని ఆర్మూరు
హైదరాబాద్: రాష్ట్ర మంత్రులను అవమానించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్కు వకాల్తా పుచ్చుకొని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి భాజపా బంట్రోతులా మారిపోయారని ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. మంత్రులు, ఎంపీల బృందానికి గాజులు, చీరలు పంపుతామంటూ వ్యాఖ్యలు చేసి రేవంత్ రెడ్డి మహిళలను కించపరిచారని జీవన్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్, భాజపాలు తెలంగాణకు పరాయి పార్టీలయ్యాయని పేర్కొన్నారు. కేసీఆర్ రైతులకు బ్రాండ్ అంబాసిడర్గా మారితే.. రేవంత్, భాజపా నేతలు బూతులకు బ్రాండ్ అంబాసిడర్లు అయ్యారని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి, తీన్మార్ మల్లన్న లాంటి వారు సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులపై వాడుతున్న భాషను తెలంగాణ సమాజం ముక్త కంఠంతో ఖండిస్తోందన్నారు. కేటీఆర్ కుమారుడిపై తీన్మార్ మల్లన్న వాడిన భాషను అమిత్ షా కుమారుడిపై వాడితే భాజపా నేతలు సమర్థిస్తారా అని ప్రశ్నించారు. తీన్మార్ మల్లన్న తన తీరు మార్చుకోక పోతే తెరాస శ్రేణులు ఎక్కడికక్కడ తరిమి కొడతాయని జీవన్ రెడ్డి హెచ్చరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
వైకాపాకు కొమ్ము కాస్తున్న పోలీసులు ఇకనైనా పార్టీ కండువాలు తీసి డ్యూటీ చేయాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యులు బొండా ఉమా హితవు పలికారు. -
లిక్కర్, మైనింగ్ రంగాల్లో రూ.లక్షల కోట్ల అవినీతి
రాష్ట్రంలో లిక్కర్, మైనింగ్ రంగాల్లో లక్షల కోట్ల రూపాయల మేర అవినీతి జరుగుతోందని భాజపా రాష్ట్ర ఎన్నికల సహ ఇన్ఛార్జ్ సిద్ధార్థ్నాథ్సింగ్ ధ్వజమెత్తారు. -
బ్యాలెట్ బాక్సులతోనే ‘స్థానిక’ ఎన్నికలు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఎన్నికలను బ్యాలెట్ బాక్సులతో నిర్వహించాలని నిర్ణయించింది.
తాజా వార్తలు (Latest News)
-
రెజ్యూమె రూపొందించడంలో ఈ తప్పులొద్దు.. గూగుల్ మాజీ రిక్రూటర్ టిప్స్
-
కోటక్ బ్యాంక్కు ఆర్బీఐ షాక్.. క్రెడిట్ కార్డుల జారీ, కొత్త కస్టమర్ల చేరికపై ఆంక్షలు
-
‘మా పేరుతో తప్పుడు ప్రచారం’.. ప్రజలకు ఎల్ఐసీ అలర్ట్!
-
సభలో మాట్లాడుతూ.. స్పృహ కోల్పోయిన నితిన్ గడ్కరీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఈ బర్త్డే ఎంతో స్పెషల్.. వారి నుంచే నాకు ఫస్ట్ విషెస్: సచిన్