Raghurama: ఏపీ ప్రభుత్వానికి అప్పులివ్వొద్దు: ఎంపీ రఘురామకృష్ణరాజు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి అప్పులివ్వొద్దని బ్యాంకులకు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు సూచించారు.

Updated : 13 Aug 2021 14:08 IST

దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి అప్పులివ్వొద్దని బ్యాంకులకు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు సూచించారు. పదే పదే నిబంధనలు ఉల్లంఘించిన ప్రభుత్వానికి రుణాలిస్తే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎడ్యుకేషన్‌ కార్పొరేషన్‌కు నిధులు అడిగితే ఇవ్వొద్దని బ్యాంకులకు సూచించారు. కళాశాలల ఆస్తులను ప్రభుత్వం అమ్ముకునేందుకు యత్నిస్తోందని రఘురామ ఆరోపించారు. ప్రభుత్వం మనస్తత్వం మారాలని వ్యాఖ్యానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని