Raghurama: కోర్టు తీర్పు రాకముందే ఎలా చెప్పగలుగుతున్నారు?: రఘురామ

వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి విదేశీ పర్యటనకు అనుమతివ్వడం సమంజసం కాదని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు...

Published : 28 Aug 2021 02:15 IST

దిల్లీ: వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి విదేశీ పర్యటనకు అనుమతివ్వడం సమంజసం కాదని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. తీరప్రాంతాల్లో అధ్యయనానికి వెళ్తున్నానని విజయసాయి చెప్పారని.. విశాఖ తీర ప్రాంతం ఎంతవరకు బాగుపడుతుందో చూద్దామని వ్యాఖ్యానించారు. దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో రఘురామ మాట్లాడారు. ఈ సందర్భంగా వైకాపా నేతలను ఉద్దేశించి విమర్శలు చేశారు.

‘‘నేనేదో విదేశాలకు పారిపోతానని ప్రచారం చేశారు. ఇప్పుడెవరు వెళ్తున్నారు? వారి మనసులో ఉన్న విషయాలను అందరిపై ఆపాదిస్తున్నారు. కోర్టు తీర్పు రాకముందే కొన్ని విషయాలు ఎలా చెప్పగలుగుతున్నారు? ఈ అంశంపై విచారణ చేపట్టాల్సిందిగా కోర్టులో పిటిషన్‌ దాఖలు చేస్తా’’ అని ఆయన చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని