Ap News: ఆ త‌ప్పు మ‌రోసారి పున‌రావృతం కాకూడదు: రామ్మోహన్‌ నాయుడు

‘‘వైకాపా చేసిన త‌ప్పుడు ప్రచారాల‌ను తిప్పికొట్టడంలో వెనుక‌ప‌డ్డాం. అందుకే ఇవాళ ఇలా ప్రతిప‌క్షంలో ఉన్నాం. ఆ త‌ప్పు మ‌రోసారి పున‌రావృతం కాకూడదు.  ..

Published : 03 Oct 2021 19:29 IST

మచిలీపట్నం: ‘‘వైకాపా చేసిన త‌ప్పుడు ప్రచారాల‌ను తిప్పికొట్టడంలో వెనుక‌ప‌డ్డాం. అందుకే ఇవాళ ఇలా ప్రతిప‌క్షంలో ఉన్నాం. ఆ త‌ప్పు మ‌రోసారి పున‌రావృతం కాకూడదు.  మూడేళ్ల వైకాపా పాలన చూశాం. ఎంత క‌క్షపూరితంగా, దుర్మార్గంగా, మోస‌పూరితంగా పాలన సాగిస్తోందో అంద‌రూ గ‌మ‌నిస్తున్నారు’’ అని తెదేపా ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. తెదేపా ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా మ‌చిలీప‌ట్నం నియోజ‌క‌వ‌ర్గ స్థాయి పార్టీ శిక్షణా త‌ర‌గ‌తుల ముగింపు కార్యక్రమంలో కొల్లు రవీంద్రతో కలిసి ఆయన పాల్గొన్నారు.

‘‘ప్రభుత్వ వైఫ‌ల్యాల‌ను ప్రజ‌ల్లోకి తీసుకెళ్ళి, వారికి అవ‌గాహన క‌ల్పించాలి. త‌ద్వారా భవిష్యత్‌లో జరగబోయే ఎన్నికల్లో తెదేపా గెలుపునకు కృషి చేయాలి. 2024లో అధికారమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సుశిక్షుతులై శ్రమించాలి. ప్రత్యేక హోదా అంశాన్ని మర్చిపోయిన సీఎం జగన్.. దిల్లీ వెళ్లేందుకు భయపడుతున్నారు. తెదేపాను రాజకీయంగా ఎదుర్కోలేక నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. అక్రమ కేసులకు భయపడే పార్టీ తెలుగుదేశం కాదు.. ఎదురు నిలిచి పోరాడే పార్టీ. తెలుగుదేశం పార్టీ హయాంలోనే రాష్ట్రంలో అభివృద్ధి జరిగింది’’ అని రామ్మోహన్‌నాయుడు అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని