AP News: కొయ్యలగూడెంలో చిన్నారుల మృతి సర్కారు హత్యలే: లోకేశ్‌

అంతుచిక్కని జ్వరాలతో విద్యార్థుల మరణాలు.. నిర్లక్ష్యపు జగన్‌ సర్కారు చేసిన హత్యలేనని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆరోపించారు. పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం బోడిగూడెం గ్రామంలో..

Published : 06 Dec 2021 01:33 IST

అమరావతి: అంతుచిక్కని జ్వరాలతో విద్యార్థుల మరణాలు.. నిర్లక్ష్యపు జగన్‌ సర్కారు చేసిన హత్యలేనని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆరోపించారు. పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం బోడిగూడెం గ్రామంలో అంతుచిక్కని జ్వరాలతో 15ఏళ్లలోపు విద్యార్థులు నలుగురు మృత్యువాతపడగా, 50 మందికి పైగా విద్యార్థులు వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై ఆయన మండిపడ్డారు. వీటికి సంబంధించిన కొన్ని వీడియోలను ఆయన విడుదల చేశారు. కొన్ని వారాలుగా 15ఏళ్లలోపు విద్యార్థులు వేర్వేరు లక్షణాలు, జ్వరాలతో బాధపడుతుంటే వైద్యారోగ్యశాఖ, విద్యాశాఖ అధికారులు కనీసం పట్టించుకునే స్థితిలో లేకపోవడం దారుణమన్నారు. అంతుచిక్కని జ్వరాలు ఎందుకొస్తున్నాయో కూడా దృష్టిసారించే తీరికలేని ప్రభుత్వం.. ఇంకెంతమంది పిల్లలు చనిపోతే స్పందిస్తుందని ప్రశ్నించారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని