Nara Lokesh: చంద్రబాబు హయాంలో నెలకో సంస్థ వచ్చేది: నారా లోకేశ్
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నెలకో పెద్ద సంస్థ వచ్చేదని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలిపారు. నెల్లూరులో
నెల్లూరు: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నెలకో పెద్ద సంస్థ వచ్చేదని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలిపారు. నెల్లూరులో లోకేశ్ మీడియాతో మాట్లాడారు. తెదేపా హయాంలో రూ.5లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని ఒక సందర్భంలో స్వయంగా వైకాపా మంత్రే చెప్పారన్నారు. వైకాపా పాలనలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాకపోగా.. ఎన్నో పరిశ్రమలు ఇక్కడి నుంచి వెళ్లిపోయాయని ఆక్షేపించారు. శాంతి భద్రతలు బాగుంటేనే రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు వస్తాయని లోకేశ్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ఇక ఉద్యోగాలు రావని తెలిసిన యువత నిరాశలో మునిగిపోయిందన్నారు. ఉద్యోగాలు రావనే బెంగతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అర్ధరాత్రి వచ్చి అరెస్టు చేస్తున్నారని లోకేశ్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం జగన్ సీఎం అయిన తర్వాత ఏపీలో 300 మంది నిరుద్యోగ యువత ఆత్మహత్య చేసుకున్నారన్నారు. అన్ ఎంప్లాయ్మెంట్లో దేశంలో ఏపీ 4వ స్థానంలో ఉందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా