Pawan Kalyan: పవన్‌ కల్యాణ్ శ్రమదానం వేదిక మార్పు

ఏపీలో రోడ్ల పరిస్థితిని నిరసిస్తూ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ రేపు చేపట్టనున్న శ్రమదానం కార్యక్రమం

Published : 01 Oct 2021 13:25 IST

రాజమహేంద్రవరం: ఏపీలో రోడ్ల పరిస్థితిని నిరసిస్తూ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ రేపు చేపట్టనున్న శ్రమదానం కార్యక్రమం వేదిక మారింది. నిరసన కార్యక్రమాన్ని తొలుత రాజమహేంద్రవరంలోని కాటన్‌ బ్యారేజీ వద్ద నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ జలవనరుల శాఖ అధికారులు అనుమతి నిరాకరించడంతో వేదికను హుకుంపేటలోని బాలాజీపేటకు మార్చారు. బాలాజీపేట కనకదుర్గమ్మ గుడి వద్ద సభ అనంతరం రోడ్డుపై పవన్‌ శ్రమదానం చేయనున్నారు. తొలుత కాటన్‌ బ్యారేజీపై పవన్‌ శ్రమదాన కార్యక్రమం ఉంటుందని జనసేన పార్టీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో కాటన్‌ బ్యారేజీపై గురువారం రాత్రికి రాత్రే మరమ్మతులు చేపట్టడం గమనార్హం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని