Pawan Kalyan: ప్రాణ త్యాగాలు చేయక్కర్లేదు.. ప్లకార్డులు పట్టుకోండి చాలు: పవన్‌

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ అంశంపై వైకాపా ఎంపీలకు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ చురకలు అంటించారు.

Updated : 20 Dec 2021 12:50 IST

అమరావతి: విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ అంశంపై వైకాపా ఎంపీలకు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ చురకలు అంటించారు. ప్రాణ త్యాగాలైనా చేసి స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని ఇటీవల జరిగిన విశాఖ కార్పొరేషన్‌ ఎన్నికల్లో వైకాపా నేతలు చెప్పారని ఆయన గుర్తు చేశారు. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో భాగంగా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ‘వైకాపా ఎంపీలూ.. కనీసం ప్లకార్డులు పట్టుకోండి.. చాలు’ అని పవన్‌ అన్నారు. ప్రాణాలు తీసుకునేంత త్యాగాలు చేయక్కర్లేదని పార్లమెంట్‌లో ప్లకార్డులు పట్టుకుంటే చాలని ఆయన ట్వీట్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని