Ap News: సానుభూతి కోసమే దీక్ష.. చంద్రబాబుకు ప్రజలే బుద్ధి చెప్పాలి: పేర్ని నాని

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌పై అసభ్య వ్యాఖ్యలు చేయించడమే కాకుండా నిరసన దీక్ష పేరిట తెదేపా అధినేత చంద్రబాబు కొత్త నాటకానికి తెరలేపారని మంత్రి పేర్ని నాని అన్నారు

Updated : 21 Oct 2021 15:44 IST

అమరావతి: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌పై అసభ్య వ్యాఖ్యలు చేయించడమే కాకుండా నిరసన దీక్ష పేరిట తెదేపా అధినేత చంద్రబాబు కొత్త నాటకానికి తెరలేపారని మంత్రి పేర్ని నాని అన్నారు. ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేకే చంద్రబాబు సానుభూతి కోసం ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు చేస్తున్నది దొంగ దీక్ష అని.. ఆ దీక్షకు కారణమేంటో చెప్పాలని డిమాండ్‌ చేశారు. దీక్షపై చంద్రబాబు తన అంతరాత్మను ప్రశ్నించుకోవాలన్నారు. తెదేపాను కుట్రలు, కుతంత్రాలు, బూతులకు పెద్ద ఫ్యాక్టరీగా చంద్రబాబు తయారు చేశారని ధ్వజమెత్తారు. బంద్ వల్ల రాష్ట్రానికి ఆర్థికంగా నష్టం జరుగుతుందని గతంలో సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు చెప్పారని నాని గుర్తు చేశారు. ఇలాంటి నేతలకు బుద్ధి చెప్పాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని