AP News: ‘పాప పరిహార యాత్ర’ అని పెట్టుకుంటే బాగుండేది: పేర్ని నాని
రైతుల ముసుగులో చేస్తున్న అమరావతి పాదయాత్ర హాస్యాస్పదమని ఏపీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన మీడియాతో
అమరావతి: రైతుల ముసుగులో చేస్తున్న అమరావతి పాదయాత్ర హాస్యాస్పదమని ఏపీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... అమరావతి మహా పాదయాత్ర పేరు ‘పాప పరిహార యాత్ర’ అని పెట్టుకుని ఉంటే బాగుండేదని విమర్శించారు. చంద్రబాబు బినామీలు, ఏజెంట్లు రైతుల ముసుగులో యాత్ర చేస్తున్నారని ఆరోపించారు. ‘‘రైతుల పేరిట రియల్ ఎస్టేట్ పాదయాత్ర చేయడం రాజకీయాల్లో కడు హీనమైనది. ఇలా చేయడం దిగజారుడు తనానికి నిదర్శనం. తెలుగుదేశం కార్యకర్తలే పాదయాత్ర చేస్తున్నారు. యాత్రతో నల్లడబ్బును తెల్లడబ్బు చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. పాప ప్రక్షాళన యాత్రను చంద్రబాబు ఓ ఎత్తుగడగా తీసుకున్నారు. యాత్ర రూట్ మ్యాప్ చూస్తే దాంట్లో ఎంత కుట్ర ఉందో అర్థమవుతుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలను కవ్విస్తూ యాత్ర సాగిస్తున్నారు. పెట్టుబడి దారులు, సానుభూతిపరులు రైతుల ముసుగులో ఉన్నారు. అమరావతి రైతులకు ప్లాట్లు ఇవ్వకుండా, అభివృద్ధి చేయకుండా వంచించింది ఎవరు?’’ అని మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!