AP News: ‘పాప పరిహార యాత్ర’ అని పెట్టుకుంటే బాగుండేది: పేర్ని నాని

రైతుల ముసుగులో చేస్తున్న అమరావతి పాదయాత్ర హాస్యాస్పదమని ఏపీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన మీడియాతో

Published : 13 Nov 2021 01:06 IST

అమరావతి: రైతుల ముసుగులో చేస్తున్న అమరావతి పాదయాత్ర హాస్యాస్పదమని ఏపీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... అమరావతి మహా పాదయాత్ర పేరు ‘పాప పరిహార యాత్ర’ అని పెట్టుకుని ఉంటే బాగుండేదని విమర్శించారు. చంద్రబాబు బినామీలు, ఏజెంట్లు రైతుల ముసుగులో యాత్ర చేస్తున్నారని ఆరోపించారు. ‘‘రైతుల పేరిట రియల్‌ ఎస్టేట్‌ పాదయాత్ర చేయడం రాజకీయాల్లో కడు హీనమైనది. ఇలా చేయడం దిగజారుడు తనానికి నిదర్శనం. తెలుగుదేశం కార్యకర్తలే పాదయాత్ర చేస్తున్నారు. యాత్రతో నల్లడబ్బును తెల్లడబ్బు చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. పాప ప్రక్షాళన యాత్రను చంద్రబాబు ఓ ఎత్తుగడగా తీసుకున్నారు. యాత్ర రూట్‌ మ్యాప్‌ చూస్తే దాంట్లో ఎంత కుట్ర ఉందో అర్థమవుతుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలను కవ్విస్తూ యాత్ర సాగిస్తున్నారు. పెట్టుబడి దారులు, సానుభూతిపరులు రైతుల ముసుగులో ఉన్నారు. అమరావతి రైతులకు ప్లాట్లు ఇవ్వకుండా, అభివృద్ధి చేయకుండా వంచించింది ఎవరు?’’ అని మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని