Ap News: సీబీఐ విజయసాయిరెడ్డిని ప్రశ్నించాలి: రఘురామ

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డికి గుండెపోటు వచ్చినట్లు విజయసాయిరెడ్డికి ఎవరు చెప్పారని ఎంపీ రఘురామ కృష్ణరాజు ప్రశ్నించారు.  వివేకా హత్య కేసులో సీబీఐ ముందుగా

Updated : 24 Aug 2021 05:39 IST

దిల్లీ: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డికి గుండెపోటు వచ్చినట్లు విజయసాయిరెడ్డికి ఎవరు చెప్పారని ఎంపీ రఘురామ కృష్ణరాజు ప్రశ్నించారు.  వివేకా హత్య కేసులో సీబీఐ ముందుగా విజయసాయిరెడ్డిని ప్రశ్నించాలని కోరారు. సోమవారం దిల్లీలో ఆయన మాట్లాడుతూ...  ‘నరసాపురంలో జగన్‌, నేను పోటీ చేస్తే ఎలా ఉంటుందని సర్వే చేశారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏమవుతుందో సర్వేలో తేలింది. జగన్‌కు, నాకు మధ్య 19 శాతమే వ్యత్యాసం, తప్పుడు ప్రచారం ఆపేందుకు సర్వే వివరాలు చెప్పా. చెవిరెడ్డి, పెద్దిరెడ్డి, చంద్రబాబుకు 60శాతం ప్రజల మద్దతు ఉంది. అమరరాజాలో కాలుష్యం గురించి మాట్లాడుతున్నారు. మరి నాసిరకం మద్యం వల్ల పాడవుతున్న ప్రజల ఆరోగ్యం గురించి ఎందుకు మాట్లాడరు?’ అని రఘురామ కృష్ణరాజు ప్రశ్నించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని