Rajinikanth: చంద్రబాబుకు రజనీ ఫోన్..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో శుక్రవారం చోటుచేసుకున్న ఘటనలపై సినీ ప్రముఖులు సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే. ప్రతిపక్ష నేత, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు....
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో శుక్రవారం చోటుచేసుకున్న ఘటనలపై సినీ ప్రముఖులు సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే. ప్రతిపక్ష నేత, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరిపై శాసనసభలో పలువురు నేతలు చేసిన వ్యక్తిగత దూషణలపై అగ్రకథానాయకుడు, సూపర్స్టార్ రజనీకాంత్ విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం ఉదయం చంద్రబాబుకు రజనీకాంత్ ఫోన్ చేసి మాట్లాడారు. శాసనసభలో జరిగిన ఘటనలతో మానసికంగా బాధపడుతోన్న ఆయన్ను పరామర్శించారు. అనంతరం ఏపీలో ఉన్న పరిస్థితుల గురించి చంద్రబాబుని అడిగి తెలుసుకున్నారు.
ఎన్టీఆర్ కుమార్తెపై.. అసెంబ్లీలోనే వ్యక్తిగత దూషణలు చేయడం బాధాకరమని నందమూరి కుటుంబసభ్యులు నిన్న ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. రాజకీయాలతో సంబంధం లేని మహిళ వ్యక్తిత్వ హననానికి పాల్పడటం ఎంతవరకు సమంజసమని వారు నిలదీశారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Wrestlers Protest: ఆందోళనకు దిగిన రెజ్లర్లపై కేసులు నమోదు
-
General News
CM Jagan: కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సీఎం జగన్ భేటీ
-
India News
Stalin: బుల్లెట్ రైలులో సీఎం స్టాలిన్.. రెండున్నర గంటల్లో 500కి.మీల ప్రయాణం!
-
Movies News
The Kerala Story: వాళ్ల కామెంట్స్కు కారణమదే.. కమల్హాసన్ వ్యాఖ్యలపై దర్శకుడు రియాక్షన్
-
General News
TSPSC Paper Leak Case: సిట్ అధికారుల దర్యాప్తు ముమ్మరం.. ఐటీ ఉద్యోగి అరెస్టు
-
World News
Cosmetic Surgeries: సౌందర్య చికిత్సతో ఫంగల్ మెనింజైటిస్.. కలవరపెడుతున్న మరణాలు