AP News: సీఎంఆర్‌ఎఫ్‌ను పునరుద్ధరించాలి: అనగాని సత్యప్రసాద్‌

ఏపీలో వైకాపా ప్రభుత్వం సీఎం సహాయనిధి(సీఎంఆర్‌ఎఫ్‌)ని నిలిపేయడం బాధాకరమని రేపల్లె తెదేపా ఎమ్మెల్యే

Updated : 26 Sep 2021 12:19 IST

రేపల్లె: ఏపీలో వైకాపా ప్రభుత్వం సీఎం సహాయనిధి(సీఎంఆర్‌ఎఫ్‌)ని నిలిపేయడం బాధాకరమని రేపల్లె తెదేపా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ అన్నారు. ఈ మేరకు ఆయన సీఎం జగన్‌కు బహిరంగ లేఖ రాశారు. కరోనా సమయంలో సీఎం సహాయనిధి ద్వారా సాయం అందక పేదల ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. రూ. లక్షలు వెచ్చించి వైద్యం చేయించుకోలేక ప్రాణాలు కోల్పోయారన్నారు. కరోనా సాయం కింద సీఎం సహాయనిధికి వచ్చిన విరాళాలను పేదల వైద్యానికి వినియోగించాలని లేఖలో కోరారు. ఎమ్మెల్యేలు ఇస్తున్న లేఖలను సీఎం పరిగణనలోకి తీసుకోవడం లేదని ఆరోపించారు. వెంటనే సీఎంఆర్‌ఎఫ్‌ను పునరుద్ధరించి పెండింగ్ బిల్లులను క్లియర్ చేయాలని డిమాండ్‌ చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని