
TS News: లాఠీ తగిలినా.. తూటా తగిలినా ముందు నాకే: రేవంత్
హైదరాబాద్: తెలంగాణలో నిరుద్యోగ జంగ్ సైరన్ పేరుతో ఇవాళ కాంగ్రెస్ చేపడుతున్న నిరసన ర్యాలీలో లాఠీ తగిలినా.. తూటా తగిలినా ముందు తనకే తగులుతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తెలిపారు. గాంధీ జయంతి సందర్భంగా ఆయన గాంధీభవన్లో మహాత్మునికి నివాళులర్పించారు. అనంతరం ఆయన జంగ్ సైరన్ కార్యక్రమంపై మీడియాతో మాట్లాడారు. ‘‘గాంధీ జయంతి వేళ శాంతియుత నిరసనలు చేపడుతున్నాం. విద్యార్థి, నిరుద్యోగ జంగ్ సైరన్కు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలి. దిల్సుఖ్నగర్ నుంచి ఎల్బీ నగర్ వరకు పాదయాత్ర ఉండనుంది. పోలీసులు జంగ్ సైరన్ ర్యాలీ ప్రశాంతంగా జరిగేలా సహకరించాలి. అత్యుత్సాహం ప్రదర్శిస్తే తీవ్ర పరిణామాలుంటాయి. పోలీసులు అడ్డుకుంటే నేనే ముందుంటా. కార్యకర్తలు భయపడాల్సిన అవసరం లేదు. ప్రశాంతంగా జరిగే కార్యక్రమాలను రెచ్చగొట్టొద్దు’’ అని రేవంత్ అన్నారు. విద్యార్థి, నిరుద్యోగ సమస్యలపై ‘విద్యార్థి, నిరుద్యోగ జంగ్ సైరన్’ పేరిట కాంగ్రెస్ పార్టీ చేపట్టనున్న నిరసన కార్యక్రమాలు ఇవాళ్టి నుంచి మొదలు కానున్నాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.