Revanth Reddy: కేసీఆర్ జంతర్మంతర్ వద్ద ధర్నా చేయాలి: రేవంత్
ధాన్యం కొనుగోళ్లపై తెరాస, భాజపా బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఆరోపించారు.
హైదరాబాద్: ధాన్యం కొనుగోళ్లపై తెరాస, భాజపా బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఆరోపించారు. ఆ రెండు పార్టీలు తోడు దొంగలని ధ్వజమెత్తారు. గాంధీభవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో రేవంత్ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ప్రజా చైతన్య యాత్రను రద్దు చేయలేదని.. వాయిదా వేశామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో జిల్లా కలెక్టర్లు రాజకీయ నేతల అవతారం ఎత్తారని ఆక్షేపించారు.
తెరాస ధర్నాలకు అనుమతులిస్తున్నారని.. తమకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. నిబంధనలు కాంగ్రెస్కేనా.. తెరాస, భాజపాలకు వర్తించవా? అని రేవంత్ నిలదీశారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా తెరాస చేపట్టిన ధర్నాలో సీఎం కేసీఆర్ ఎందుకు పాల్గొనలేదని ప్రశ్నించారు. రైతుల కోసం దిల్లీలోని జంతర్మంతర్ వద్ద ఆయన ధర్నా చేయాలని డిమాండ్ చేశారు. ధనిక రాష్ట్రం ధాన్యం కొనుగోలు చేయలేదా? ధాన్యం కొనని పార్టీలకు ఓటెందుకు వేయాలని రేవంత్ ప్రశ్నించారు. ప్రత్యేక బడ్జెట్ పెట్టి ధాన్యం కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
హుజూరాబాద్పై అర్థవంతమైన సమీక్ష జరిగింది: భట్టి
అనంతరం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఈ దేశం ఇంత బలంగా నిర్మాణం అవడానికి జవహర్లాల్ నెహ్రూ వేసిన పునాదులే కారణమన్నారు. దేశాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరూ నెహ్రూకు నివాళులర్పించాలని కోరారు. కొందరు స్వార్థ రాజకీయ నాయకులు తమ వ్యక్తిగత స్వార్థం కోసం దేశ స్వాతంత్ర్యంలో ఎలాంటి సంబంధం లేనివారిని ఉద్యమకారులుగా చెబుతున్నారని ఆక్షేపించారు. 1947 స్వాతంత్ర్య పోరాటాన్ని అవమాన పరచడం దారుణమన్నారు. అలాంటి వ్యాఖ్యలు చేసేవారు దేశద్రోహులని మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలను భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అడ్డగోలుగా అమ్మేస్తోందని భట్టి విమర్శించారు. ఆ ప్రభుత్వాన్ని గద్దె దింపాల్సిన అవసరముందన్నారు. హుజూరాబాద్ ఎన్నికపై దిల్లీలో అర్థవంతమైన సమీక్ష జరిగిందని భట్టి చెప్పారు. ఈ విషయంలో వచ్చి ఏ వార్త కూడా నిజం కాదన్నారు. ఈ సమీక్షపై మీడియాకు తాము చెప్పిందే వాస్తవన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
వైకాపాకు కొమ్ము కాస్తున్న పోలీసులు ఇకనైనా పార్టీ కండువాలు తీసి డ్యూటీ చేయాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యులు బొండా ఉమా హితవు పలికారు. -
లిక్కర్, మైనింగ్ రంగాల్లో రూ.లక్షల కోట్ల అవినీతి
రాష్ట్రంలో లిక్కర్, మైనింగ్ రంగాల్లో లక్షల కోట్ల రూపాయల మేర అవినీతి జరుగుతోందని భాజపా రాష్ట్ర ఎన్నికల సహ ఇన్ఛార్జ్ సిద్ధార్థ్నాథ్సింగ్ ధ్వజమెత్తారు. -
బ్యాలెట్ బాక్సులతోనే ‘స్థానిక’ ఎన్నికలు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఎన్నికలను బ్యాలెట్ బాక్సులతో నిర్వహించాలని నిర్ణయించింది.
తాజా వార్తలు (Latest News)
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
-
టేకాఫ్ సమయంలో ఊడిన బోయింగ్ విమానం టైరు
-
సొంత అభ్యర్థికి వ్యతిరేకంగా ‘కాంగ్రెస్’ ప్రచారం.. ఎందుకంటే!
-
రెజ్యూమె రూపొందించడంలో ఈ తప్పులొద్దు.. గూగుల్ మాజీ రిక్రూటర్ టిప్స్