Revanth Reddy: అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా బదులు తీర్చుకుంటాం: రేవంత్‌

కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో సహా బదులు తీర్చుకుంటామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో భూపాలపల్లిలో

Updated : 30 Sep 2022 15:37 IST

భూపాలపల్లి: కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో సహా బదులు తీర్చుకుంటామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో భూపాలపల్లిలో ‘ప్రజా గొంతుకకు ప్రణామం’ పేరుతో భారీ బహిరంగసభ నిర్వహంచారు. ఈసందర్భంగా రేవంత్‌రెడ్డి సమక్షంలో గండ్ర సత్యనారాయణ కాంగ్రెస్‌లో చేరారు. అనంతరం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ... ‘‘కార్యకర్తలు, నాయకులను నట్టేట ముంచి తెరాసలో చేరిన గండ్ర వెంకటరమణారెడ్డిరెడ్డి రాజకీయ మనుగడలేదు. భూపాల పల్లి ప్రజలను నమ్మించి మోసం చేశారు. కాంగ్రెస్‌ కార్యకర్తలు గండ్రకు మరణశాసనం రాయబోతున్నారు. అతనికి ఇదే చివరి ప్రజా జీవితం. భూపాలపల్లికి సరైన రోడ్లు, నీటి సౌకర్యం లేవు. గండ్ర వెంకటరమణారెడ్డి గాలి, నీటిని సైతం కొల్లగొట్టారు. ప్రశ్నించే గొంతుకలను అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్‌ కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెడుతున్నారు. అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా బదులు తీర్చుకుంటాం’’ అని రేవంత్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ నేతలు శ్రీధర్‌బాబు, మధుయాష్కీగౌడ్‌, సీతక్క తదితరులు సభలో పాల్గొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని