TS news: సెంటిమెంట్ డైలాగులు కాదు.. పనిచేసే వాళ్లను గెలిపించాలి: హరీశ్రావు
‘‘రూపాయి బొట్టు బిళ్ల గెలవాల్నా? నెలకు రూ.2016 పింఛను ఇచ్చే టీఆర్ఎస్ ప్రభుత్వం గెలవాల్నా?.. ఆరవై రూపాయల గడియారం కావాలా?ఆడపిల్ల పెళ్లికి లక్షా పదహారు ...
కరీంనగర్: ‘‘రూపాయి బొట్టు బిళ్ల గెలవాల్నా? నెలకు రూ.2016 పింఛను ఇచ్చే టీఆర్ఎస్ ప్రభుత్వం గెలవాల్నా?.. ఆరవై రూపాయల గడియారం కావాలా?ఆడపిల్ల పెళ్లికి లక్షా పదహారు రూపాయలు కావాలా?. సెంటిమెంట్ డైలాగులు కాదు.. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇచ్చేటొళ్లు కావాలి. మనకు కల్యాణలక్ష్మీ లక్ష రూపాయాలు ఇచ్చేటొళ్లు కావాలి. బిడ్డ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్ ఇచ్చేటొళ్లు కావాలే. దాని గురించి ప్రజలే ఆలోచించుకోవాలి’’ అని మంత్రి హరీశ్రావు అన్నారు. శనివారం ఆయన హుజూరాబాద్లో పర్యటించారు. పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో వడ్డీలేని రుణాల చెక్కులను మంత్రి హరీశ్రావు పంపిణీ చేశారు. స్వశక్తి మహిళా గ్రూపులకు రూ.1,25,60,000 చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో రెండు పడక గదుల ఇళ్లు ఒక్కటి కూడా పూర్తి కాకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఈటల ఏడేళ్లు మంత్రిగా ఉండి.. పేదలకు ఇళ్ల నిర్మాణం చేయలేదని అడగటం తప్పా?అని ప్రశ్నించారు. స్వంత స్థలాల్లో రెండు పడక గదుల ఇళ్లను కట్టిస్తామని హామీ ఇచ్చారు. సైదాపూర్-బోర్నపల్లి రోడ్డుకు రూ.ఆరు కోట్లు మంజూరు చేస్తానని ప్రకటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
వైకాపాకు కొమ్ము కాస్తున్న పోలీసులు ఇకనైనా పార్టీ కండువాలు తీసి డ్యూటీ చేయాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యులు బొండా ఉమా హితవు పలికారు. -
లిక్కర్, మైనింగ్ రంగాల్లో రూ.లక్షల కోట్ల అవినీతి
రాష్ట్రంలో లిక్కర్, మైనింగ్ రంగాల్లో లక్షల కోట్ల రూపాయల మేర అవినీతి జరుగుతోందని భాజపా రాష్ట్ర ఎన్నికల సహ ఇన్ఛార్జ్ సిద్ధార్థ్నాథ్సింగ్ ధ్వజమెత్తారు. -
బ్యాలెట్ బాక్సులతోనే ‘స్థానిక’ ఎన్నికలు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఎన్నికలను బ్యాలెట్ బాక్సులతో నిర్వహించాలని నిర్ణయించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
నాలుగో రోజూ లాభాల్లో.. 22,400 ఎగువన నిఫ్టీ
-
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
-
ఎన్నికలను మేం నియంత్రించలేం: ‘వీవీప్యాట్’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు
-
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి