YS Sharmila: పుల్లెంలలో వైఎస్‌ షర్మిల నిరాహార దీక్ష

నల్గొండ జిల్లా చండూర్ మండలంలోని పుల్లెంల గ్రామంలో వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు

Updated : 27 Jul 2021 15:10 IST

చండూర్‌: నల్గొండ జిల్లా చండూర్ మండలంలోని పుల్లెంల గ్రామంలో వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల నిరాహార దీక్ష చేపట్టారు. ప్రతి మంగళవారం నిర్వహించే నిరుద్యోగ దీక్షలో భాగంగా.. ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అంతకముందు ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి శ్రీకాంత్‌ కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. అనంతరం స్థానిక చౌరస్తాలో ఏర్పాటు చేసిన నిరాహారదీక్షా స్థలిలో వైఎస్‌ఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి దీక్షను ప్రారంభించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని