Badvel By Election: ఉప ఎన్నికను సీరియస్‌గా తీసుకున్నాం: సోము వీర్రాజు

అభివృద్ధికి భాజపా పెట్టింది పేరు అని ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా కడప జిల్లా బద్వేలు వచ్చిన ఆయన.. మీడియాతో

Updated : 27 Oct 2021 15:10 IST

బద్వేలు: అభివృద్ధికి భాజపా పెట్టింది పేరు అని ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా కడప జిల్లా బద్వేలు వచ్చిన ఆయన.. మీడియాతో మాట్లాడారు. బద్వేలులో కేంద్ర ప్రభుత్వ నిధులతోనే అభివృద్ధి జరిగిందన్నారు. వైఎస్సార్‌ కుటుంబానికి బద్వేలు ప్రజలు 40ఏళ్లుగా పట్టం కడుతున్నా.. ఇక్కడ కనీసం ప్రభుత్వ డిగ్రీ కళాశాల కూడా లేదని ఆక్షేపించారు. ఈ ఉప ఎన్నికను భాజపా సీరియస్‌గా తీసుకుందని సోము వీర్రాజు చెప్పారు. 50 కార్లలో వెళ్లి భాజపా కలసపాడు మండల అధ్యక్షుడికి బలవంతంగా వైకాపా కండువా కప్పారని ఆయన ఆరోపించారు. రాజకీయాల్లో హుందాగా ఉండాలని హితవు పలికారు. తిరుపతి ఉప ఎన్నికలాగే బద్వేలులోనూ చేయాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుకుంటున్నారని.. ఇక్కడ ఆ పరిస్థితి ఉండదన్నారు. భాజపాకు మద్దతివ్వాలని వైకాపా అసమ్మతి నేతలనూ కోరతామని చెప్పారు.

బద్వేలులో వైకాపా దౌర్జన్యాలు పెరిగిపోయాయని.. ఓటేయకపోతే ప్రభుత్వ పథకాలు రద్దు చేస్తామని ఆ పార్టీ నేతలు బెదిరిస్తున్నారని భాజపా ఎంపీ సీఎం రమేశ్‌ ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని