Ap news: మూడు రాజధానుల ప్రకటన మతిలేనిది: ఎంపీ రఘురామకృష్ణరాజు

సీఎం జగన్‌ పర్యటనలకు వెళ్లినప్పుడల్లా రాజధానిపై బొత్స సత్యనారాయణ అగ్గిరాజేస్తున్నారని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు

Published : 31 Aug 2021 01:40 IST

అమరావతి: సీఎం జగన్‌ పర్యటనలకు వెళ్లినప్పుడల్లా రాజధానిపై బొత్స సత్యనారాయణ అగ్గిరాజేస్తున్నారని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. మూడు రాజధానుల విషయంపై ఆయన మండిపడ్డారు. అదో మతిలేని ప్రకటన అని ఎద్దేవా చేశారు. రాజధానిని తరలించాలని చూస్తే భూములిచ్చిన వేల మంది రైతులు చూస్తూ ఊరుకోరన్నారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారయ్యిందన్నారు. కర్నూలులో హైకోర్టు పెడితే అధికారులే వెళ్లలేని పరిస్థితి ఎదురవుతుందని రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని