Ts News: ఈటలను గెలిపించి కేసీఆర్‌ అహంకారాన్ని అణచాలి: తరుణ్‌ చుగ్‌

అహంకారానికి, ఆత్మ గౌరవానికి మధ్య హుజూరాబాద్‌ ఉప ఎన్నిక జరుగుతోందని భాజపా రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌ తరుణ్‌ చుగ్‌ అన్నారు. హుజూరాబాద్‌లో భాజపా అభ్యర్థి ఈటలకు

Updated : 30 Sep 2022 15:21 IST

హుజూరాబాద్‌: అహంకారానికి, ఆత్మ గౌరవానికి మధ్య హుజూరాబాద్‌ ఉప ఎన్నిక జరుగుతోందని భాజపా రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌ తరుణ్‌ చుగ్‌ అన్నారు. హుజూరాబాద్‌లో భాజపా అభ్యర్థి ఈటలకు మద్దతుగా తరుణ్‌ చుగ్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. హుజూరాబాద్‌లో భాజపా మేనిఫెస్టో విడుదల చేసి మీడియాతో మాట్లాడారు. అర్హులందరికీ కేంద్ర ప్రభుత్వ పథకాలను అందిస్తామన్నారు. హుజూరాబాద్‌లో విద్యా వ్యవస్థ అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలన నిజాం కాలాన్ని తలపిస్తోందని వ్యాఖ్యలు చేశారు. ఈటలను గెలిపించి సీఎం కేసీఆర్‌ అహంకారాన్ని అణచాలని తరుణ్‌ వ్యాఖ్యానించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు