Atchannaidu: జగన్.. ఉత్తరాంధ్రకు ఏం చేశారు?: అచ్చెన్నాయుడు
ఉత్తరాంధ్ర సమస్యలను ఈ ప్రాంత మంత్రులు సీఎం జగన్ వద్ద ప్రస్తావించగలరా?
విశాఖ: ఉత్తరాంధ్ర సమస్యలను ఈ ప్రాంత మంత్రులు సీఎం జగన్ వద్ద ప్రస్తావించగలరా? అని తెదేపా ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. విశాఖ తెదేపా కార్యాలయంలో నిర్వహించిన ‘ఉత్తరాంధ్ర రక్షణ- చర్చా వేదిక’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విశాఖ మెడ్టెక్ జోన్పై గతంలో వైకాపా నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడారని.. కరోనా సమయంలో అదే ప్రజల ప్రాణాలు కాపాడిందన్నారు.
అభివృద్ధి చేయాలని సీఎం అనుకుంటే ఏమైనా చేయొచ్చని.. జగన్ ఈ ప్రాంతానికి ఏం చేశారని అచ్చెన్న ప్రశ్నించారు. అభివృద్ధి చేయలేకే మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారని ఆయన విమర్శించారు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి తెదేపా ఏం చేసిందో చెబుతామని.. మీరేం చేశారో చెప్పగలరా? అని వైకాపాకు అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.